'అ' సినిమాతో దర్శకుడైన ప్రశాంత్ వర్మ మంచి మార్కులు కొట్టేశాడు. ఒక విలక్షణ‌మైన కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారంటూ అంతా ప్రశంసించారు. ఆయన తాజా చిత్రంగా 'కల్కి' రూపొందింది. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ నేపథ్యంలో తమిళ హీరో ధనుశ్ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్ వర్మకి లభించినట్టుగా ఫిల్మ్ నగర్లో వార్త‌లు వినిపిస్తోంది. ఇటీవలే ధనుశ్ ను కలిసి ప్రశాంత్ వర్మ ఒక కథ చెప్పడం .. పూర్తి స్క్రిప్టును సిద్ధం చేయమని ధనుశ్ చెప్పడం జరిగిపోయాయట. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో ధనుశ్ పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుందట. అందువల్లనే వెంటనే ఆయన ఓకే అనేశాడని చెబుతున్నారు.


మ‌రి ఇక ఇప్ప‌టివ‌ర‌కు చిన్న సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌శాంత్ వ‌ర్మ ఏకంగా ధ‌నుష్ సినిమాని ఒప్పుకున్నాడు. మ‌రి ధ‌నుష్‌ని హ్యాండిల్ చెయ్య‌గ‌ల‌డా లేదా అని కొంద‌రిలో అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక‌పోతే ధ‌నుష్‌ని డిఫ‌రెంట్‌గా ప్ర‌జెంట్ చేయ‌నున్నార‌ని తెలుస్తుంది.  ధ‌నుష్‌కి క‌థ న‌చ్చి ఒప్పుకున్నారా లేక త‌న పాత్ర న‌చ్చి ఒప్పుకున్నారా అన్న‌ది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: