టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోస్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. నిజానికి బాహుబలి సినిమాల తరువాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ మరియు మార్కెట్ విస్తరించిన విషయం తెలిసిందే. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం ఒక్క బాలీవుడ్ సినిమా చేయకుండా అక్కడి హీరోలు మరియు హీరోయిన్లు మన గురించి కొంత మాట్లాడుకునేలా చేయగలిగారు. 

ఒకానొక సమయంలో యావత్ ఇండియాలోని మోస్ట్ డిజైరబుల్ మెన్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచిన మహేష్, ఇటీవల ఫరెవర్ డిజైరబుల్ మెన్ గా అక్కడి బడా హీరోలైన ఖాన్ హీరోల సరసన నిలిచారు. ఇక మహేష్ కు టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు సహా కొందరు బాలీవుడ్ హీరోయిన్ల లోను ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అయన సరసన ఒక అవకాశం వస్తే చాలు అనుకునేవారు లేకపోలేదు. నిజానికి ప్రస్తుతం మరోవైపు ప్రభాస్ ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ స్టేటస్ సాధించి అందరిని మించిపోయాడు అని చెప్పాలి. 

ఇక ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ప్రస్తుతం ప్రభాస్ తో సాహో సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్, కొన్నాళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఇండస్ట్రీవారు మరియు తన స్నేహితులు ఒకవేళ నీకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ వస్తే మాత్రం మిస్ చేసుకోవద్దని చెప్పారని ఆమె అన్నారు. ఇక ప్రభాస్ సరసన నటించాలనేది కూడా తన కోరిక అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఆశపడిన ప్రకారం ఎలాగో సాహోలో ప్రభాస్ సరసన నటించింది, కాబట్టి ఇక మిగిలింది సూపర్ స్టార్ మహేష్ బాబే కాబట్టి, రాబోయే రోజుల్లో తనకు మహేష్ ప్రక్కన ఛాన్స్ ఏమైనా వస్తే మాత్రం తప్పకుండా నటిస్తానని అంటోందట ఈ ముద్దుగుమ్మ. మరి ఆమె కోరిక రాబోయే రోజుల్లో ఎంతవరకు తీరుతుందో చూద్దాం....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: