'నీది నాది ఒకే కథ' చిత్రంతో  విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు  'వేణు ఉడుగుల', కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా  రానా, సాయిప‌ల్ల‌విలను   హీరోహరోయిన్ లుగా పెట్టి    తెలంగాణా ప్రాంతంలో 1990 నాటి సామజిక పరిస్థితులు ప్రతిబింబించే పీరియాడిక్ సోషల్ డ్రామాగా 'విరాటపర్వం' అనే    చిత్రాన్ని  తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా,  టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 


అయితే తమ సినిమా ఓపెనింగ్ కి కూడా ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న రానా - సాయి పల్లవి హాజరు కాలేదు. ఎంత బిజీగా ఉంటే మాత్రం తమ సినిమా లాంచింగ్ కి కూడా రాకపోవడం ఆ సినిమా డైరెక్టర్ కి బాధ కలిగించే అంశమే.  వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ఇక  వేణు  'నీది నాది ఒకే కథ' చిత్రంలో కూడా  హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. అలాగే ఈ సినిమానూ రానా క్యారెక్టర్ పైనే నడుపుతాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: