వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత సందీప్ కిషన్ కెరీర్ బాగా ఊపందుకుంటుందనుకున్నారు అందరు. కానీ అనుకున్నదొకటి అయినదొకటి. సోలో హీరోగా సందీప్ కి ఒక్క భారీ హిట్ పడలేదు. ఒకటి అరా యావరేజ్ సినిమాలతో సరిపెట్టుకున్నాడు. దీంతో హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మారి హీరోగా నటించిన మొదటి సినిమా నిను వీడని నీడను నేనే. ఈ సినిమాను జులై 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. అదేరోజు పూరి జగన్నాథ్-రామ్ ల ఇస్మార్ట్ శంకర్ కూడా వుంది. వెంకటాద్రి ప్రొడక్షన్స్ అంటూ బ్యానర్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్, ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు డైరక్షన్ లో నిర్మించాడు.


ఈ సినిమా కోసం రచయిత కోన వెంకట్ బంధువు, సినీ స్టయిలిస్ట్ కోన నీరజ ఓ పాట రాయడం విశేషం. అది కూడా టైటిల్ సాంగ్. నిను వీడని నీడను నేనే అంటూ సాగే ఈ పాటకు థమన్ ట్యూన్ అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి తయారుచేసిన ఈ కథను కాస్త ఎక్కువ ఖర్చుతోనే తెరకెక్కించారు.  


సినిమాను అవుట్ రేట్ పంపిణీ బాధ్యతను నిర్మాత అనిల్ సుంకర తీసుకున్నారని లేటెస్ట్ న్యూస్. ఆయన తన ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సినిమాను విడుదల చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో సందీప్ సరసన అన్యాసింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా పోసాని, మురళీశర్మ, వెన్నెల కిషోర్, తదితరులు నటిస్తున్నారు. మరి ధైర్యం చేసి నిర్మాతగా, హీరోగా రెండు పడవల మీద వేసిన అడుగు ఎంతవరకు సక్సస్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజయ్యో వరకు ఆగాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: