జగన్ కు రాష్ట్రంలో భారీ డిమాండ్ ఉన్నది.  జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.  బడుగు బలహీన వర్గాలకు జగన్ అండగా ఉండటం వలన ఇది సాధ్యం అవుతున్నది.  జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇందుకు ఒకరకంగా ఉపయోగపడుతున్నాయి.  


ప్రస్తుతం జగన్ ఢిల్లీలో ఉన్నారు.  ఉదయం బీజేపీ నాయకులను కలిసిన జగన్, సాయంత్రం జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొన్నారు.  రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై చర్చించారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఏంటి అనే దాని గురించి మోడీ వివరించారు.  


ఇక, జగన్ ను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరసగా కలిసి అభినందలు తెలియజేస్తున్నారు.  కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జగన్ ను కలిశారు.  అనేక విషయాల గురించి చర్చించారు. జగన్ కు కొన్ని సలహాలు ఇచ్చినట్టు సమాచారం.  


జగన్ చిన్నవాడు కావడం పైగా మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: