యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాతో పాటుగా తారక్ మహేష్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. 


మహేష్ అనగానే సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా అనుకుంటే పొరపడినట్టే. మహేష్, ఎన్.టి.ఆర్ ఈ మల్టీస్టారర్ సినిమాకు ఇంకాస్త టైం పడేట్టు ఉంది. అయితే ఇక్కడ మాత్రం నిర్మాత మహేష్ ఎస్ కోనేరు సినిమాలో తారక్ నటిస్తున్నాడు. నరేంద్రనాథ్ డైరక్షన్ లో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో ఓ సినిమా వస్తుంది.


డెబ్యూ డైరక్టర్ అయినా ఆమె ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నాడనే. అయితే ఈమధ్య తారక్ ఈ సినిమా చేసేందుకు సుముఖంగా లేడని అతని ప్లేస్ లో మరొకరిని వెతుకుతున్నారని అన్నారు. దీనిపై కీర్తి సురేష్ సీరియస్ అవగా ఎలాగోలా తారక్ తోనే ఈ సినిమా చేయించే ఏర్పాటు చేశారు.


సినిమాలో ఎన్.టి.ఆర్ రోల్ ఏంటి.. జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లే పాత్ర చేస్తున్నాడా లేక సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఏదైనా చేస్తున్నాడా అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా తారక్ మాత్రం తన పి.ఆర్ మహేష్ కు సపోర్ట్ గా ఉండాలని అనుకోవడం గొప్ప విషయం. ఈ సినిమా ఓపెనింగ్ రోజు కూడా కళ్యాణ్ రాం వచ్చి చిత్రయూనిట్ ను విష్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: