కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత మండల అధ్యక్షుడిగా జరిగే నడిగర్ సంఘం ఎన్నికల విషయంలో గతంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అప్పట్లో సంస్థ నిధులను పక్కదారి పట్టించి ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారని నటుడు శరత్ కుమార్, రాధా రవి పై తీవ్ర విమర్శలు చేశారు హీరో విశాల్. తాజాగా మరొకసారి నడిగర్ సంఘం ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో హీరో విశాల్... శరత్ కుమార్, రాధారవిలను టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ ఓ వీడియో రూపొందించారు.


ఇది చూసిన వరలక్ష్మీ శరత్ కుమార్.. విశాల్ పై మండిపడింది. అతడిని దూషిస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖ రాసి షేర్ చేసింది. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేయడం నీతిమాలిన పని అని, ఇప్పటికైనా క్లాస్ గా ప్రవర్తించడం నేర్చుకోవాలని పెద్ద క్లాస్ తీసుకుంది. తాజాగా శరత్ కుమార్ భార్య రాధిక కూడా విశాల్ పై మండిపడింది. శరత్ కుమార్ పై చేస్తోన్న ఆరోపణల్లో నిజం ఉంటే రుజువు చేయాలని, పదే పదే అబద్ధాలను ఇతరులపై రుద్దుతూ వారి ప్రతిష్టతకు భంగం కలిగించొద్దని సోషల్ మీడియాలో ఓ లేఖ రూపంలో తెలిపింది.


ఇష్టానుసారంగా నోటికి ఇష్టం వచ్చినట్లు అవినీతి ఆరోపణలు చేసి వాటిలోకి శరత్ కుమార్ ని లాగొద్దని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా సంఘంలో ఉన్న ఇతర అధికారులపై కూడా మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాగే వ్యవహరిస్తే నడిగర్ సంఘానికి మరియు అందులో ఉన్న నటీనటులకు మంచిది కాదని రాధిక పేర్కొన్నారు. మరి రాధిక చేసిన కామెంట్లపై విశాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: