దాసరి మరణం తరువాత పలు కీలక అంశాల్లో ప్రభు మరియు అతని భార్యను విచారించాల్సిన తరుణంలో ప్రభు, అతని మొదటి కుటుంబం పోలీసులకు చిక్కకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు.  దృశ్యం సినిమాలో చూపిన మాదిరి వారి వ్యవహారం పోలీసులకు అంతుచిక్కకుండా పోతుంది. దానితో పోలీస్ డిపార్టుమెంట్ వారిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

 

ఈ నెల 9 నుంచి కనిపించకుండా పోయిన దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కుమారుడు తారక ప్రభు కోసం పోలీసులు గాలింపు  చర్యలు ముమ్మరం చేశారు. తన పెద్ద భార్య సుశీల, అత్తతో కలిసి పలు ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు భావిస్తున్న పోలీసులు, వారి ఆచూకీ కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే, ప్రభు తన వద్ద సెల్‌ఫోన్ కూడా లేకుండా జాగ్రత్త పడడంతో లొకేషన్ తెలుసుకోవడం ఒకింత కష్టంగా మారింది. 

 

9న అదృశ్యమైన ప్రభు, మొదట చిత్తూరు వెళ్లి అక్కడి నుంచి భార్య, అత్తను తీసుకుని తిరుపతి వెళ్లాడు. 12న మియాపూర్ వచ్చి అక్కడ రెండు రోజులు గడిపాడు. అయితే, పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసిన ప్రభు అక్కడి నుంచి కూడా వెళ్లిపోయాడు. అయితే, వీరంతా ఎక్కడ ఉన్నారన్న విషయం మాత్రం పోలీసులకు మిస్టరీగా మారింది. త్వరలోనే వారిని పట్టుకుని తీరుతామని జూబ్లీహిల్స్ పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: