2002లో యువసామ్రాట్ నాగార్జున హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ క్లాస్ ఎంటర్టైనర్ మన్మధుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించిన ఆ సినిమాకు అప్పట్లో మంచి పేరొచ్చింది. నాగార్జున సరసన అన్షు, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలో డైలాగ్స్ మరియు కామెడీ ఇప్పటికీ మన ప్రేక్షకులు మరిచిపోలేదనే చెప్పాలి. 

మరి మళ్ళి ఇన్నేళ్లకి ఈ సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా సమంత, అక్షర గౌడ, కీతి సురేష్ స్పెషల్ అఫియరెన్స్ ఇవ్వనున్నారు. ఇకపోతే రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుని రేపు విడుదలయ్యే సినిమాపై అంచనాలు బాగా పెంచిందని చెప్పాలి. నిజానికి మన టాలీవుడ్ లో సీక్వెల్ గా వచ్చిన సినిమాల్లో చాలావరకు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మరి ఇన్నేళ్ల తరువాత వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఎంతవరకు అందుకుంటుంది అనే అనుమానం చాలామందిలో ఉంది. 

ఇక దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కొత్త వాడు కావడంతో అప్పటి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మరియు హిట్ చిత్రాల దర్శకుడు విజయ భాస్కర్ రేంజ్ టేకింగ్ ఎంతవరకు అందుకోగలడు అనేది సినిమా చూస్తేనే కానీ చెప్పలేం. అయితే ఈ విషయమై కొందరు మాత్రం టీజర్ బట్టి చూస్తే సినిమా అంచనాలు అందుకోగలడు అంటుంటే, మరికొందరు మాత్రం కొంతవరకు టీజర్ ని చూసి అది చెప్పడం కష్టం అంటున్నారు. మరి నాగార్జున ఇమేజికి తగ్గట్లుగా అందరి అంచనాలు అందుకుని మన్మధుడు 2 తో దర్శకుడు రాహుల్ ఎంతవరకు హిట్ కొడతాడో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగవలసిందే...!!


మరింత సమాచారం తెలుసుకోండి: