మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. ఇక ప్రత్యేకంగా అయన సినిమా కోసమే ఎదురు చూసే ప్రేక్షకులు ఎందరో ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ప్రస్తుతం అయన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీతో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత పేతురేజ్, సుశాంత్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా గతంలో సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ తీసిన అతడు, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయనే తీసిన అత్తారింటికి దారేది సినిమాలను కలగలిపితే ఎలా ఉంటుందో, ఈ సినిమా కూడా అలానే ఉంటుందట. అతడు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగుతూ, అండర్ కరెంట్ లో యాక్షన్ కూడా ఉంటుంది, ఇక అత్తారింటికి దారేది మంచి ఎమోషన్స్ తో పాటు హీరో క్యారెక్టర్ లో వేరియేషన్స్, మాస్ కోసం మంచి ఫైట్స్ మరియు అంతకు మించి కామెడీ కూడా ఉంటుంది. 

అయితే ఈ రెండు సినిమాల్లోని అంశాలను కలగలిపి అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంతో జాగ్రత్తగా త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ తరువాత తాను ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత సినిమా కోసం తన టీమ్ లో కొందరు సభ్యులను మార్చిన త్రివిక్రమ్, వారి నేతృత్వంలోనే ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ సినిమా స్క్రిప్ట్ ని పక్కాగా రూపొందించడం జరిగిందట. ఇక ప్రస్తుతం అటు టాలీవుడ్ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు వేచిచూడల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: