సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు సినిమాలు లేని సమయంలో అవకాశం ఉంటె చాలు తన కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లిపోతుంటారు. ఇక ఇటీవల తన 25వ సినిమా మహర్షి తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్, కొద్దిరోజుల పాటు ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం విదేశాలకు వెళ్లడం జరిగింది. ఇక ఇటీవల జరిగిన ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ ను అయన కుటుంబంతో సహా వెళ్లి వీక్షించడం జరిగింది. ఇకపోతే చాలారోజుల పాటు ఈసారి టూర్ వెళ్లిన సూపర్ స్టార్ మహేష్, నేడు ఉదయం హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఆయన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న దృశ్యాలు కాసేపటినుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే మహేష్ 26వ సినిమా సరిలేరు నీకెవ్వరుకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి, అతి త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. అయితే మొదట కొద్దిరోజులు ఇతర ఆర్టిస్టులతో సినిమా షూటింగ్ జరుపుతారని, అనంతరం జులై మొదటి వారంలో మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. ఇక షూటింగ్ ప్రారంభమయిన తరువాత ఎక్కడా పెద్దగా గ్యాప్ లు లేకుండా షూటింగ్ మొత్తాన్ని త్వరితగతిన పూర్తి చేయనున్నారట. 

తన సినిమాల షూటింగులను ఎంతో వేగవంతంగా పూర్తి చేసే అలవాటుగల యువ దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పించారు. ఇక సినిమాని ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా 2020లో విడుదల చేయాలని సంకల్పించారు. ఇక ఇందులో మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తుండగా, చలో మరియు గీత గోవిందం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. వరుసగా మూడోసారి సూపర్ స్టార్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి రేపు విడుదల తరువాత ఈ సినిమా ఎంతటి హిట్ సాధిస్తుందో వేచిచూడాలి...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: