మీ టు ఉద్యమం గత ఏడాది ఎంతో మంది సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించినది. ఈ ఉద్యమం కారణంగా ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. చాలామంది ఆఫర్లు లేక పరువు పోగొట్టుకుని బయటకు రాలేక తమలో తామే కుమిలిపోయారు. పలువురు సీనియర్ హీరోయిన్ల‌ నుంచి సింగ‌ర్ల వరకు ఈ ఉద్యమం పుణ్యమా ? అని తాము ఎలా లైంగిక వేధింపులకు గురి అయింది విడమరిచి చెప్పారు. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మ‌యి చేసిన ఆరోపణల కారణంగా ఓ సంగీత దర్శకుడు ఫ్యామిలీలో చిచ్చు రేగి ఆ దంపతులు విడాకులు తీసుకునే వరకు పరిస్థితి వెళ్లినట్లు తెలుస్తోంది. 


డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తన కెరీర్ ఆరంభంలో తాను ఓ సంగీత దర్శకుడు నుంచి వేధింపులకు గురైనట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. కన్నడ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ తన కెరీర్ ప్రారంభంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పిన సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్‌లో ఆఫ‌ర్ కోరితే త‌న‌ను ఇంటికి ర‌మ్మ‌న్నాడ‌ని ఆమె చెప్పింది. అలాగే ఒకసారి తన స్నేహితురాలైన ఒక సింగర్‌తో రఘు దీక్షిత్ అసభ్యంగా ప్రవర్తించాడని చేసిన ఆరోపణలను రఘు దీక్షిత్ ఒప్పుకున్నాడు. ఓ పాట రికార్డింగ్ సమయంలో తాను తీవ్రమైన భావోద్వేగానికిలోనై ఆమెను హ‌గ్ చేసుకుని.. ముద్దుపెట్టుకున్నాన‌ని చెప్పాడు. 


అయితే ఆ సమయంలోనే తాను ఆ సింగర్‌కు క్షమాపణలు కూడా చెప్పానని మీడియా ముందు చెప్పాడు. చిన్మయి చేసిన ఆరోపణల తర్వాత రఘు దీక్షిత్ కుటుంబంలో తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. రఘు భార్య అప్పటినుంచి రఘుపై లెక్కలేనన్ని అనుమానాలు పెట్టుకోవడంతో ఇరువురి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగిపోయింది. చివరకు ఇరు కుటుంబాల సభ్యులు వీరి మ‌ధ్య రాజీ ప్ర‌య‌త్నాలు చేసినా విఫ‌ల‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రు విడాకుల కోసం బెంగ‌ళూరు ఫ్యామిలీ కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని.. వీరు త్వ‌ర‌లో విడిపోతార‌న్న టాక్ వ‌చ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: