మరి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్న ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఇరు దేశాల మధ్య మరొకసారి దాయాదుల పోరుగా మారడంతో ఈ మ్యాచ్ లో గెలుపుకోసం పాకిస్థాన్ ప్రజలు నమాజ్ చేస్తుంటే మన భారతీయులు చాలామంది హోమాలు చేస్తున్నారు. ఎప్పుడు ఈ ఇరు జట్ల మధ్య క్రికెట్ పోటీ జరిగినా అది ఇండో పాకిస్తాన్ వార్ గా మారుతున్న నేపధ్యంలో ఈరోజు జరగబోతున్న ఈ పోటీ ఫలితం గురించి భారత్ లోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈరోజు జరగబోతున్న ఈ క్రికెట్ పోటీకి సంబంధించి ‘స్టార్ మా’ ఛానల్ తెలుగులో ప్రసారం చేసే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో సమంత కూడ కనిపించబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా సమంత తన లేటెస్ట్ మూవీ ‘ఓ బేబి’ ని ప్రమోట్ చేయబోతోంది. 

అంతేకాదు సమంత ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి తన ట్విటర్ లైవ్ ఛాట్ లో తన అభిమానులతో సందడి చేయబోతోంది. ఈ ఛాట్ లో సమంతతో పాటు బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ రాజీవ్ మసంద్ కూడ పాల్గొనబోతున్నాడు. దీనితో ఈరోజు తెలుగులో స్టార్ మా స్పోర్ట్స్ ఛానల్ చూసేవారికి ఇండో పాకిస్థాన్ మ్యాచ్ హడావిడి మాత్రమే కాకుండా సమంత హడావిడి కూడ కనబడబోతోంది. 

ఈమూవీ విడుదలకు ఇంకా మూడు వారాలు ఉన్నా సమంత చాల ముందు చూపుతో ‘ఓ బేబీ’ ని ప్రమోట్ చేస్తున్న విధానం చూసినవారు ఈమూవీకి అత్యంత భారీ కలక్షన్స్ రాబట్టడమే ప్రధాన ఉద్దేశ్యంగా సమంత అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. సమంత లెగ్ ‘గోల్డెన్ లెగ్’ అంటారు కాబట్టి ఆమె స్టార్ మా ఛానల్ లో కనిపిస్తున్న నేపధ్యంలో ఆమె ప్రభావంతో ఇండియా పాకిస్తాన్ పై విజయం సాధిస్తుందని భావిద్దాం..  


మరింత సమాచారం తెలుసుకోండి: