తమిళ చిత్రపరిశ్రమలో నడిగర్ సంఘం ఎన్నికలు టాక్ అఫ్ ది టౌన్ గా మారాయి. నటి వరలక్ష్మి శరత్ కుమార్ హీరో విశాల్ పై ఘాటు విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే. చాలా రోజులగా శరత్ కుమార్, విశాల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకరినొకరు విమర్శించుకకుంటున్నారు. ఇటీవల శరత్ కుమార్ ని విమర్శిస్తూ విశాల్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీనితో వరలక్ష్మి కోపం కట్టలు తెంచుకుంది. తన తండ్రిని విమర్శించడంతో విశాల్ పై విరుచుకు పడింది.

 

విశాల్ మరీ చీఫ్ గా  బిహేవ్ చేస్తున్నాడని, అతడిపై ఉన్న నమ్మకం పోయిందని వరలక్ష్మి తీవ్రంగా వ్యాఖ్యానించింది. దీనిపై విశాల్ తాజాగా స్పందించాడు. వరలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా హుందాగా బదులిచ్చాడు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. వరలక్ష్మికి మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు ఉందని విశాల్ తెలిపాడు.

 

మరోవైపు సీనియర్ హీరోయిన్ రాధిక కూడా విమర్శలతో విశాల్ పై విరుచుకుపడింది. నిర్మాతల మండలిలో ఉన్న డబ్బు మొత్తం విశాల్ ఖాళీ చేశాడని రాధిక ఆరోపించింది. శరత్ కుమార్ ని విరిసించడానికి సిగ్గు లేదా.. న్యాయస్థానం ఎదుట నిలుచున్న నువ్వా విమర్శించేది అంటూ రాధిక విశాల్ పై దుమ్మెత్తి పోసింది.

 

గతంలో విశాల్, వరలక్ష్మి ప్రేమలో మునిగితేలారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఐతే అదంతా పుకారేనని వారిద్దరూ చాలా తేలికగా కొట్టి పారేసారు. ఇక ఒక తెలుగు నటితో విశాల్ నిశ్చితార్ధం ఇటీవల జరగడంతో అందరి అనుమానాలకు పుల్ స్టాప్ పడింది.  కానీ వారిరువురి మధ్య అప్పుడప్పుడు గిల్లికజ్జాలు జరుగుతుండడం అందరికి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: