చిరకాల శత్రువులుగా పేరు మోసిన భారత్, పాకిస్థాన్ మధ్య నేడు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రేక్షకుడి దగ్గర నుండి ప్రముఖులు వరకూ ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ ని వీక్షిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న బన్నీ 19వ చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో బన్నీతో పాటు పూజ హెగ్డే కూడా షూటింగ్ లో పాల్గొంటుంది.
కాగా బన్నీ ఒక పక్క బిజీ బిజీగా షూట్ చేస్తేనే.. మధ్యమధ్యలో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ దృశ్యాన్ని హీరోయిన్ పూజ హెగ్డే తన కెమెరాలో బంధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇక పూజా హెగ్డే ఇప్పటికే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది. అలాగే త్రివిక్రమ్ తో కూడా 'అరవింద సమేత'కి కలిసి పని చేసింది.
కాగా ఈ సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నిటికి మించి ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.