చిరకాల శత్రువులుగా పేరు మోసిన  భారత్‌, పాకిస్థాన్‌ మధ్య  నేడు మ్యాచ్‌  జరుగుతున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రేక్షకుడి దగ్గర నుండి  ప్రముఖులు వరకూ ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ ని వీక్షిస్తున్నారు. అయితే  అల్లు అర్జున్  త్రివిక్రమ్ కాంబినేషన్ లో  వస్తోన్న   బన్నీ 19వ చిత్రం  సెకండ్ షెడ్యూల్  షూటింగ్   ప్రస్తుతం   హైదరాబాద్ లో జరుగుతుంది.  ఈ  షెడ్యూల్ లో బన్నీతో పాటు పూజ హెగ్డే  కూడా షూటింగ్ లో  పాల్గొంటుంది.

కాగా  బన్నీ  ఒక పక్క బిజీ బిజీగా షూట్ చేస్తేనే.. మధ్యమధ్యలో భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ దృశ్యాన్ని  హీరోయిన్ పూజ హెగ్డే  తన కెమెరాలో బంధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.  ఇక పూజా హెగ్డే  ఇప్పటికే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది. అలాగే   త్రివిక్రమ్ తో  కూడా 'అరవింద సమేత'కి కలిసి పని చేసింది.

కాగా  ఈ సినిమాలో  సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నిటికి మించి  ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి  హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది.  ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు. 






మరింత సమాచారం తెలుసుకోండి: