ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇటు భారత అభిమానులతో పాటు అటు పాక్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ జరుగుతోన్న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫార్డ్‌లో వర్షం పడే సూచనలున్నాయని మొదట వార్తలు రావడంతో ఇరు దేశాల అభిమానులు భయపడ్డారు. మొత్తానికి వరుణుడు కరుణించడంతో మ్యాచ్ ప్రారంభమైంది.

 

టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. కాగా, ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌ను చూసేందుకు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఇంగ్లండ్ కు వెళ్లారు. ప్రస్తుతం ఆమె స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి మన దేశ ఆటగాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు.

 

ఈరోజు ఫాదర్స్ డేను పురష్కరించుకుని తన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు సోషల్ మీడియా ద్వారా మంచు లక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ‘నాకన్నీ మీరే. మీ నిరంతర మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు. ఐ లవ్ యూ నాన్న. అత్యుత్తమ మోహన్‌బాబు గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

 

w/of రామ్ తరువాత అమ్మడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నట్టుగా సమాచారం.  అందువలన అటు ఖాళీ సమయాన్ని సరదాగా గడిపినట్టుంటుంది, ఇటు మ్యాచ్ చూడొచ్చని అనుకుందేమో మరి! సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటోంది మన మంచు వారి ముద్దుల గుమ్మ.  తన తండ్రి మోహనబాబు గారికి లక్ష్మి గారంటే యెనలేని ప్రేమ, ఆప్యాయత.


మరింత సమాచారం తెలుసుకోండి: