యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాపై ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ ఇండియన్ యాక్షన్ ఫిలిం అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతోంది. నార్త్ అభిమానులు కూడా సాహో కోసం చాల తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

 

సాహో లాంటి భారీ చిత్రం విడుదలవుతున్నప్పుడు దానికి దగ్గరలో విడుదలయ్యే సినిమాలకు ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. సాహో చిత్రం ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, తమిళ హీరోలు సాహూ ఎఫెక్ట్ తో తమ చిత్రాలని వాయిదా వేసుకుంటున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు.

 

బోనికపూర్ నిర్మాతగా అజిత్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ముందుగా ఆగష్టు 9న రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఆగష్టు 15న సాహో విడుదల కానుండడంతో వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. దీనితో ఈ చిత్రాన్ని సాహో కంటే కొన్ని వారాల ముందే, అంటే సరిగ్గా జూలైలో విడుదల చేయాలని బోనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సూర్య కాప్పాన్ చిత్రాన్ని కూడా వాయిదా వేయాలని చిత్ర యూనిట్  చూస్తోందని వినికిడి.

 

కోలీవుడ్లో అగ్ర హీరోలైన సూర్య, అజిత్ చిత్రాలే వాయిదాలు పడుతున్నాయంటే, మన రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్డం ఏ రేంజు కు పోయిందో అర్ధమౌతుంది.  ఐతే దీనంతటికి కారణం దర్శక దిగ్గజం శ్రీ రాజమౌళి గారే అని వేరేగా చెప్పనక్కర్లేదు.  వీరిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి ఎంతటి విజయం సొంతం చేసుకుందో అందరికి విదితమే.  ఆ క్షణంనుండి, మన బాహుబలి ప్రభాస్ వేట మొదలైంది....


మరింత సమాచారం తెలుసుకోండి: