టాలీవుడ్ లో రాక్ స్టార్ గా పేరుగాంచిన యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పేరు చెపితే చాలు, యువత అయన మ్యూజిక్ తో ఊగిపోతారు. అయితే ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం దేవిశ్రీ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోవడం లేదని, కొన్ని సినిమాల్లో ఇదివరకు ఇచ్చిన ట్యూన్స్ మాదిరి ట్యూన్స్ ఇస్తున్నారు అంటూ అక్కడక్కడా కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. ఇక ఇటీవల సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమాకు కూడా మొదట్లో అయన కంపోజ్ చేసిన సాంగ్స్ అంతగా బాగోలేవని కొందరు మహేష్ ఫ్యాన్స్ బహిరంగంగానే ఆయనపై సోషల్ మీడియా వేదికల్లో విమర్శలు చేసారు. 

అయితే కొన్నాళ్లకు సినిమా విడుదల తరువాత మెల్లగా మహర్షి సాంగ్స్ మంచి పేరు సంపాదించాయి. అయితే దేవి తాము ఊహించిన స్థాయి మ్యూజిక్ ఆ సినిమాలో మాత్రం ఇవ్వలేదనే భావన ఇప్పటికీ కొందరు మహేష్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా దేవిశ్రీ నే సంగీత దర్శకుడిగా తీసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా పూజ జరిగిన రోజున మహేష్ గారి ఫ్యాన్స్ కోసం ఎప్పటికీ నిలిచిపోయేలా ఒక లవ్ సాంగ్, ఒక పక్కా మాస్ సాంగ్ కంపోజ్ చేయబోతున్నాం అంటూ మాటిచ్చారు దేవి. అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం, ప్రకారం కేవలం ఆ రెండు సాంగ్స్ మాత్రమే కాదు, టోటల్ గా ఆల్బమ్ మొత్తం అదరగొట్టే విధంగా సాంగ్స్ కంపోజ్ చేయాలని ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలెట్టాడట దేవి. 

ఇదివరకు మహేష్ తో భరత్ అనే నేను, మహర్షి తరువాత ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుతో వరుసగా మూడవ సారి సూపర్ స్టార్ తో పనిచేస్తున్న దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా మ్యూజిక్ కూడా అదరగొట్టి హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకుంటాను అంటున్నాడట. నిజానికి దేవిశ్రీ ప్రసాద్ మనసు పెట్టి మ్యూజిక్ ఇస్తే అది అదిరిపోద్ది అనడానికి గతంలో అయన పనిచేసిన అనేక సినిమాలు రుజువు చేసాయి. మరి దేవిశ్రీ, మహేష్ తో చేయబోయే ఈ సినిమాకు ఎంతవరకు అయన ఫ్యాన్స్ ని మరియు ఆడియన్స్ ని ఆకట్టుకునే మ్యూజిక్ ఇస్తాడో చూడాలి...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: