ప్రపంచంలో క్రికెట్ అంటే ఎంతగా ప్రేమిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  చిన్న నుంచి పెద్ద వరకు క్రికెట్ అంటే ఎంతగానో అభిమానిస్తారు.  ఇక ప్రపంచ కప్ అంటే ఎవ్వరైనా టివీలకు అతుక్కుపోతారు.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కప్ మానియా కొనసాగుతుంది.  అయితే ప్రపంచ కప్ అంటే అన్నిటీమ్ లు ఒక ఎత్తైతే.. పాకిస్థాన్-ఇండియా మద్య పోరు అంటే నరాలు తెగిపోయేలాంటి ఉత్కంఠం కొనసాగుతుంది.  
ఈ మ్యాచ్ తిలకించడానికి అన్నివర్గాల అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా వెర్రెక్కి పోతుంటారు.  ఇక టాలీవుడ్ నుంచి అయితే వెంకటేష్ ఇతర నటీనటులు కూడా ఎంతో ఉత్సాహాంతో తిలకిస్తుంటారు.  తాజాగా ప్రస్తుతం ఇండియా, పాక్ మధ్య ఇంగ్లాడ్ లోనే మాంచెస్టర్ లో రసవత్తరమైన పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్  మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి సందడి చేస్తోంది. 
మ్యాచ్ వీక్షించేందుకు ఆమె ఇంగ్లాడ్ వెళ్లారు. త్రివర్ణ పతాకం చేతిలో పట్టుకుని టీం ఇండియాకు మద్దతు తెలుపుతోంది. మంచు లక్ష్మీ స్టేడియంలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ రన్ వీర్ సింగ్ కూడా మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇండియా, పాక్ మ్యాచ్ చూస్తున్నాడు. రణవీర్ సింగ్ ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ మూవీ 83లో నటిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: