టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు విప్పే ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో హడావిడి సృష్టించిన శ్రీ రెడ్డి మెగా కుటుంబంపై దారుణమైన విమర్శలు చేసి గతంలో అజ్ఞాతంలోకి వెళ్లి పోయింది. ముఖ్యంగా మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి అజ్ఞాతం లో ఉంటూ తన ఫేస్బుక్ పేజ్ ద్వారా లైవ్ లోకి వస్తూ కాంట్రవర్సీలు కామెంట్లు చేస్తూ హడావిడి సృష్టిస్తూ ఉంటుంది.


ఇదిలా ఉండగా తాజాగా శ్రీ రెడ్డి మరోసారి కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ని టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా రాయలేని భాషలో అతన్ని బూతులు తిట్టి విరుచుకు పడింది. హీరోయిన్స్ తో కమిట్ మెంట్ తీసుకోకుండా విశాల్ అసలు సినిమానే చేయడని శ్రీరెడ్డి ఆరోపించింది. ఇక విశాల్ కేరవాన్ కి అమ్మాయిలను సప్లై చేసే వ్యక్తి తనకు తెలుసని వెల్లడించింది.


విశాల్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని అతని వల్ల నాశనమైన ముగ్గురు బాధితులు తనకు తెలుసని చెప్పుకొచ్చింది. తన జోలికి వస్తే కాళీమాత అవతారమెత్తి అంతు చూస్తానంటూ ఏకంగా బెదిరించింది. దీంతో ఇప్పుడు శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: