ప్రభాస్ సాహో రిలీజ్ కు దగ్గరవుతున్నది. షూటింగ్ కంప్లీట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగష్టు 15 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ను అఫీషియల్ గా ప్రకటించారు. మొదట ఈ సినిమాకు సంగీతం అందించేందుకు శంకర్ త్రయం మ్యూజిక్ చేయాల్సి ఉంది.
మరి ఏమైందో ఏమో... ఈ ప్రాజెక్ట్ నుంచి ఆ ముగ్గురు తప్పుకున్నారు. వేంటనే ఈ ప్రాజెక్ట్ కోసం చాలామంది ప్రయత్నం చేశారు. ఇందులో థమన్ కూడా ఉన్నారని సమాచారం. అయితే ఫైనల్ గా జిబ్రాన్ ను కన్ఫర్మ్ అయ్యారు. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు.
రన్ రాజా రన్ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్ చాప్తర్ కు, రీసెంట్ గా వచ్చిన టీజర్ కు జిబ్రాన్ సంగీతం అందిన్హారు. శంకర్ త్రయం తప్పుకున్నాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ గా జిబ్రాన్ కు అవకాశం కల్పించారు.
ఇది ముందుగా తెలిసినా ఎందుకు ఇప్పటివరకు ఆగరో అర్ధంకాని ప్రశ్న. మరి ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ను జిబ్రాన్ చేస్తాడో చూడాలి. రిలీజ్ కు పెద్ద సమయం కూడా లేదు. చూద్దాం ఎం జరుగుతుందో.