ఏం మాయ చేశావే సినిమాతో సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.  ఆ పరిచయంతోనే చైతూతో ప్రేమలో పడింది.  మనసులు కలవడానికి మనం సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.  ఆ తరువాత పెళ్లి అనే మజిలీతో రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోకి అడుగుపెట్టారు.  

టాలీవుడ్ బెస్ట్ సెలెబ్రిటీ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకటి.  మూవీ విషయంలోనే కాకుండా కెరీర్ విషయంలో వీరి ప్లానింగ్ సూపర్ గా ఉంటుంది.  చైతు సమంతలు సినిమాలపై దృష్టిపెడుతూనే.. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ పై కూడా ఓ లుక్కేశారు.  భవిష్యత్తులో స్టూడియోకు సంబంధించిన విషయాలను చూసుకోవాల్సిన బాధ్యత వీళ్లదే కావడంతో ఇప్పటి నుంచే దానిపై దృష్టిపెట్టారు.  

సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం ఓ బేబీ సినిమా చేసింది.  ఈ మూవీ జులై 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సమంత సినిమాలను ముందుగానే చూసే చైతు.. ఓ బేబీ సినిమా చూశాడట.  సినిమాను చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేసినట్టు సమంత చెప్పింది.  భర్త చైతు కళ్ళల్లో ఆ ఆనందం చూసి శ్యామ్ ఏడ్చేసిందట.  

కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య తదితరులు నటిస్తున్నారు.  నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: