సాధారణంగా పెద్ద పెద్ద స్టార్లు అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో అథిధి పాత్రల్లో కనిపిస్తుంటారు. 
చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ళు ఇది వరకు ఇలా చేశారు. అయితే యంగ్ హీరోల్లో మాత్రం ఇంతవరకు ఎవరూ అతిధి పాత్రలు చేయలేదు. అయితే తాజాగా వచ్చిన ఒక వార్త  ఈ సాంప్రదాయానికి తెర తీసేలా ఉంది. అవును యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్  ఒక సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాడట. 

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్న సంగతొ తెలిసిందే. ఆ సినిమా ప్రాసెస్ లో ఉండగానే   గెస్ట్ రోల్ కోసం సిద్ధం కావడమంటే ఆ రోల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర అనే దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఎన్టీఆర్‌ని సంప్రదించగా ఆయన ఓకే చెప్పనట్లు సమాచారం. కేవలం 10 నిముషాలు మాత్రమే ఉండే ఈ రోల్‌లో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

 ఈ కామియోకు సంభందించిన నేరేషన్ విన్న ఎన్టీఆర్.. ఫైనల్ గా ఓ సారి మొత్తం స్క్రిప్ట్ విని, అది తను మాత్రమే చేయగలిగే ప్రత్యేకమైన పాత్ర అయితే తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారట. అయితే ఈ గెస్ట్ రోల్ లో చేయమని ఎన్టీఆర్‌కి సూచించింది ఆయన అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు అని తెలుస్తోంది.

సఖి అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే హైదరాబాద్‌లో కొంత భాగం షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్..త్వ‌ర‌లోనే ఓ భారీ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ల‌నుందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: