బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమాతో ప్రభాస్ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది.  దేశ విదేశాల్లో ఆయనకు క్రేజ్ మామూలుగా లేదు.  బాహుబలి రిలీజ్ అవకముందే తన తర్వాతి సినిమా" సాహో" అని ప్రకటించేశాడు.  అప్పటి నుండి "సాహో" కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది.

రీసెంట్ గా రీలీజైన టీజర్ కి మంచి స్పందన అభించింది.విడుదల చేసిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. . ప్రపంచ వ్యాప్తంగా ఈ టీజర్ కి మంచి ఆదరణ లభించింది.  "సాహో" యూనిట్ నుంది తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది.అదేంటంటే, "సాహో" సినిమాకి ముందుగా సంగీతం అందించడానికి బాలీవుడ్ త్రయం అయిన "శంకర్-ఎహ్ సాన్- లాయ్ " లను అనుకున్నారు. 

వీరు ఈ సినిమా నుండి తప్పుకున్నారని సమాచారం. వీళ్ళు అందించిన సంగీతం చిత్ర యూనిట్ అనుకున్నంతగా లేకపోవడంతో వీరు తప్పుకున్నారట.  ఈ సినిమాకి నేపథ్య సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారట. సుజీత్ మొదటి సినిమా అయిన "రన్ రాజా రన్" సినిమాకి ఈయనే సంగీతం అందించారు.

టీజర్ లో ఉన్న యాక్షన్ సన్నివేశాలకి జిబ్రానే మ్యూజిక్ అందించాడు. దానికి మంచి స్పందన లబించింది. అయితే సాహో పాటలకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంతవరకు తెలిసి రాలేదు. ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంది. మరి అంతటి ప్రతిష్టత్మక చిత్రానికి సంగీతం అందించే అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడలి. ఈ సినిమాని UV   క్రియేషన్స్ నిర్మిస్తుంది.శ్రద్ధాకపూర్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. సుజీత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: