టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో కొందరు సినిమా మ్యానేజర్లు మరియు కో ఆర్డినేటర్లు సినిమాల్లోకి వస్తున్న అమ్మాయిలను మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు అంటూ నటి శ్రీరెడ్డి ఇటీవల బహిరంగంగా దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అనంతరం మా అసోసియేషన్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి, ఆ తరువాత మా అసోసియేషన్ లో స్త్రీల కోసం ప్రత్యేక కమిటీలు వేసేవరకు తన పోరాటం ఆపలేదు. ఇక అక్కడినుండి ఆమె పేరు అందరినోట మారుమ్రోగిపోయింది. 

అయితే ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అయన ఫ్యాన్స్ పై తనదైన రీతిలో విమర్శలు చేయడం మొదలెట్టిన శ్రీరెడ్డి, ఆ తరువాత పలువురు టాలీవుడ్ ప్రముఖులకు తనతో ఉన్న సంబంధనలు బయటపెట్టింది. ఇక అప్పటినుండి శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవరి లీక్స్ బయటపెడుతుందో అని సినిమా నటులు కొందరు వారిలోవారు మధనపడుతున్నారు. అంతటితో ఆగకుండా దర్శకుడు కొరటాల శివ, రచయిత కోన వెంకట్, నాచురల్ స్టార్ నాని వంటివారు సరైనవారు కాదని వాళ్ళ మీద విమర్శలు చేసింది శ్రీరెడ్డి. ఇక తాజాగా తమిళ నటుడు మరియు నడిగర్ సంగం అధ్యక్షుడైన విశాల్ ని టార్గెట్ చేసింది. నిజానికి గతంలో శ్రీరెడ్డి చేసిన విమర్శలకు విశాల్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. 

ఇక ప్రస్తుతం నడిగర్ సంఘానికి త్వరలో ఎన్నికలు జరగనుండడంతో విశాల్, వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ పై విమర్శలు చేయగా, వాటికీ స్పందించిన వరలక్ష్మి, విశాల్ పై ఫైర్ అవుతూ ఒక ప్రకటన కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విశాల్ కు ఎవరూ నడిగర్ సంఘం తరపున వోట్ వేయొద్దు, విశాల్ రెడ్డి ఎలా ఉన్నావ్, త్వరలోనే శ్రీ రెడ్డి లీక్స్ బయటపడనున్నట్లు యాష్ ట్యాగ్ తో తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షాకిచ్చింది. ఇక ఈ న్యూస్ నిన్నటినుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి దీనిపై విశాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: