జగన్ మోహన్ రెడ్డి విజయం కోసం పోసాని కృష్ణమురళీ ఎన్నికలలో ప్రచారం చేయడమే కాకుండా జగన్ విజయం కోసం అనేక దేవుళ్ళకు మొక్కులు కూడ మొక్కుకున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడ పోసాని తన ఆనందాన్ని కొనసాగిస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విలక్షణ నటుడు జగన్ మనస్తత్వం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 

ప్రస్థుత రాజకీయాలలో చంద్రబాబు అవసరం ఇక లేదనీ అంటూ జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలి అన్న తన కల నెరవేరినందుకు చాల ఆనంద పడుతున్న విషయాన్ని వివరించాడు. ప్రస్తుత రాజకీయాలలో జగన్ అంత అహింసా వాది మరెవ్వరూ లేరని అంటూ జగన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తికాదనీ పోసాని అభిప్రాయ పడుతున్నాడు. 

అంతేకాదు జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డిలా మంకు పట్టుదల పట్టే వ్యక్తి కాదనీ జగన్ పై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తనదైన రీతిలో జనంలోకి వెళ్ళగల సత్తా ఒక్క ముఖ్యమంత్రి జగన్ కు మాత్రమే ఉంది అంటూ ఆయన వ్యక్తిత్వం పై పోసాని ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం జగన్ తనకు సంబంధించిన అనేకమంది సన్నిహితులకు పదవులు కట్టబెడుతున్న నేపధ్యంలో పదవుల పట్ల తనకు కోరిక లేదంటూనే జగన్ దృష్టిలో మళ్ళీ పడటానికి పోసాని వ్యూహాత్మకంగా ఈ కామెంట్స్ చేసి ఉంటాడా అని అనిపించడం సహజం.

అయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాల మంది సెలెబ్రెటీలు జగన్ కోసం ప్రచారం చేసిన నేపధ్యంలో వారందరూ ఎదో ఒక పదవి ఇప్పుడు ఆశిస్తున్న నేపధ్యంలో జగన్ కు ఒత్తిడి ఎదురౌతోంది అని టాక్. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి తీవ్ర అయోమయంలో కొనసాగుతున్న నేపధ్యంలో తనకోసం కష్టపడిన వారందరికీ పదవులు ఇస్తూ మరొకవైపు తనకు ఓట్లు వేసిన ప్రజలు అందరికీ చేసిన వాగ్దానాలు తీర్చడానికి జగన్ పడుతున్న కష్టం ఆయన విమర్శకులకు కూడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: