టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ఎంతో మంది సినీ పరిశ్రమకు వచ్చిన యువతులను కొంత మంది దళారులు ట్రాప్ చేసి దారుణంగా మోసం చేస్తున్నారని..లైంగిక వాంఛ తీర్చుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నారని నటి శ్రీరెడ్డి ఎన్నో సంచలనాలు సృష్టించింది.  తాను అలాంటి వారి ఉచ్చులో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నానని..అందుకు నిదర్శనంగా కొంత మంది కొంత మంది సెలబ్రెటీలకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  



శ్రీరెడ్డి చేసిన ఉద్యమానికి మహిళాసంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు మద్దతు పలికారు.  తన ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.  పవన్ ఫ్యాన్స్ ఆమెపై దారుణమైన ట్రోలింగ్స్ మొదలు పెట్టారు.  తనకు వచ్చిన మద్దతు కూడా వెనక్కి వెళ్లిపోయింది.  దాంతో ఇక లాభం లేదనుకొని ఆమె చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.  తాజాగా ఇప్పుడు ఆమె మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తానంటుంది.  ఈసారి  శ్రీరెడ్డి లీక్స్ అంటూ కొంతమంది హీరోలు, నిర్మాతలు, దర్శకుల బండారం బయట పెడతానని అంటుంది. 

ఈ నేపథ్యంలో ఆమె తమిళ స్టార్ హీరో విశాల్ ని టార్గెట్ చేసినట్లు సమాచారం.  త్వరలో తమిళ సినీ పరిశ్రమలో నడిఘర్ సంఘం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు విశాల్ పై విమర్శలు చేస్తున్నారు.  ఇప్పుడు విశాల్ ని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. విశాల్ రెడ్డి ఎలా ఉన్నావ్ అంటూ.. త్వరలోనే శ్రీ రెడ్డి లీక్స్ బయటపడనున్నట్లు యాష్ ట్యాగ్ తో షాకిచ్చింది. ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: