ఇంగ్లాండ్ దేశంలో ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ హాజరవటం జరిగింది. మ్యాచ్ కి రణవీర్ సింగ్ చేసిన హడావిడి మ్యాచ్ కే పెద్ద హైలైట్ అయ్యింది. ముఖ్యంగా మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు మైదానంలో వీరేందర్ సెహ్వాగ్ తో కలిసి రణవీర్ సింగ్ బీభత్సం సృష్టించారు.
అంతేకాకుండా మైదానంలో ఉన్న ప్రేక్షకులతో ఫోటోలు దిగి పలువురు క్రికెటర్లతో కూడా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హడావుడి ప్రశ్నించాడు. గమ్మత్తైన విషయం ఎక్కడ ఏమిటంటే రణవీర్ సింగ్ కి క్రికెట్ ఆట గురించి అంతగా తెలియదు. కానీ రణ్వీర్ సింగ్ బాలీవుడ్లో రూపుదిద్దుకోబోతున్న ఓ ప్రతిష్ఠాత్మక మూవీకి సైన్ చేశాడు. అదే కపిల్ దేవ్ బయోపిక్. బయోపిక్ అనగానే.. కపిల్ దేవ్ బాల్యం నుంచీ చూపిస్తారనుకుంటే పొరపాటే.
1983 నాటి ప్రపంచకప్ ఘట్టాలను మాత్రమే తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకొంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ మూవీలో కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు రణ్వీర్ సింగ్.ఈ పాత్ర కోసం క్రికెటర్ల హావభావాలను దగ్గరి నుంచి పరిశీలించడానికి రణ్వీర్ సింగ్ మాంఛెస్టర్కు వెళ్లినట్లు ఫిలింనగర్ టాక్.