గత శుక్రువారం విడుదలైన తాప్సీ ‘గేమ్ ఓవర్’ మూవీకి విమర్శకుల ప్రశంసలతో పాటు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ఆదరణ కూడ లభించడంతో అతి తక్కువ బడ్జెట్ తో నిర్మింపబడి తెలుగు తమిళ హిందీ భాషలలో ఒకేసారి విడుదలైన ఈమూవీ కేవలం ఒక వారంలోనే లాభాల బాట పడుతుందని బాలీవుడ్ మీడియా విశ్లేషణలు చేస్తోంది. దీనితో తాప్సీ ఈమూవీని మరింత గట్టిగా ప్రమోట్ చేస్తూ అనేక ఛానల్స్ కు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ హడావిడి చేస్తోంది. 

గతంలో తాప్సీ తన బొడ్డు పై పండ్లు పువ్వులు కొట్టి రాఘవేంద్రరావు ఆనందం పొందారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాకు హాట్ టాపిక్ గా మారిన ఈమె మరో సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తాను నటించే హీరో మార్కెట్ బట్టి తన పారితోషికం తగ్గించుకోమంటున్నారు అంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ సమర్ధత గుర్తించరు అంటూ మరో వివాదానికి తెర తీసింది.

కొన్ని నెలల క్రితం ఒక టాలీవుడ్ నిర్మాత తనను సంప్రదించి ఒక మీడియం రేంజ్ హీరోతో తాను తీయబోతున్న సినిమా కథ చెప్పి అందులో తనను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్న విషయాన్ని బయట పెట్టింది. అయితే ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకు తిరిగి ఆమూవీ నిర్మాత తన దగ్గరకు వచ్చి ఆ హీరో సినిమాలు అన్నీ ఫెయిల్ అయి మార్కెట్ తగ్గిపోతున్న పరిస్థుతులలో తన పారితోషికం మరింత తగ్గించుకోమని చెప్పిన విషయాలను గుర్తుకు చేసుకుంది. 

అయితే ఆహీరో మార్కట్ తో తన పారితోషికాన్ని ఎందుకు ముడి పెడుతున్నారు అని ప్రశ్నించి ఆ హీరోకు పారితోషికం తగ్గించారా అని అడిగినప్పుడు తన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వక పోవడంతో ఆ మూవీ తాను వదులుకున్న విషయాన్ని తెలియచేసింది. అంతేకాదు టాలీవుడ్ కన్నా బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ ప్రతిభను ఎక్కువగా గుర్తిస్తారు అంటూ అందువల్లనే తాను ప్రస్తుతం ఎక్కువగా హిందీ సినిమాలను చేస్తున్న విషయాలను బయటపెట్టింది. అయితే ఇన్ని మాటలు చెప్పిన తాప్సీ ఆ టాలీవుడ్ హీరో పేరు చెప్పక పోవడం ఆశ్చర్యకరం..  


మరింత సమాచారం తెలుసుకోండి: