యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ స్టామినా చూపించేలా ఉంటుందని రీసెంట్ గా రిలీజైన టీజర్ చూస్తేనే తెలుస్తుంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది సాహో.  


బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన యువ దర్శకుడు సుజిత్ మీద చాలా పెద్ద భారమే పెట్టాడు ప్రభాస్. అయితే సినిమా మేకింగ్ వీడియోస్ తో వారెవా అనిపించగా ఈమధ్య రిలీజైన టీజర్ సుజిత్ సత్తా చాటాడనిపిస్తుంది.  


కంటెంట్ కు తగినట్టుగా విజువల్ గ్రాండియర్ గా సాహో ఉండబోతుందని తెలుస్తుంది. బాహుబలితో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సాహోతో మరో సంచలనానికి సిద్ధమయ్యాడని చెప్పొచ్చు. ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేసిన ప్రభాస్ ఆరోజున తన ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా సాహో ఉంటుందని ఫిక్స్ అయ్యారు.


ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. టీజర్ చూసిన ఆడియెన్స్ సాహో సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఇది బెస్ట్ మూవీ అవుతుందని అంటున్నారు. మరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందో లేదో చూడాలి.
   


మరింత సమాచారం తెలుసుకోండి: