ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ ఇంగ్లండ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్ లో ఇండియానే ఫేవరెట్. వరుసగా మ్యాచులు గెలుస్తూ ముందుకు దూసుకెల్తుంది. మొన్న ఆస్ట్రేలియాను సైతం మట్టి కరిపించి మన సత్తా ఏంటో చూపించింది.  అవకాశం వస్తే ప్రతీ ఒక్కరు మ్యాచుని స్టేడియంలో చూడాలనుకుంటారు.  కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ అవకాశం వదులుకుని వచ్చేశాడు.

 

మొన్న రిలీజైన " మహర్షి" సినిమా  బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా బానే సంపాదించింది. 100 కోట్ల గ్రాస్ సాధించిన మొదటి మహేష బాబు చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమా అయిపోగానే వెంటనే మరో సినిమా లాంచ్  చేశారు. దానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి " సరిలేరు నీకెవ్వరు" అనే టైటిల్ ని సెట్ చేసారు.

 

ఈ సినిమా ప్రారంభోత్సవం  తర్వాత మహేష్ క్రికెట్ ప్రపంచకప్ మ్యాచులని చూడడానికి ఇంగ్లండ్ వెళ్ళాడు. మొత్తం మూడు మ్యాచులు చూడాల్సి ఉంది.  ఇండియాతో ఆడే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ మ్యాచెస్ చూడడానికి షెడ్యూలు ఖరారు చేసారు. కానీ ఒక్క ఆస్ట్రేలియా మ్యాచ్ మాత్రమే చూశాడు. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా లండన్ లోని హోటల్ లోనే ఉండీపోయాడు.

 

మన ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ ని చూడకుండా ఇండియా వచ్చేసాడు.  ఆదివారం మ్యాచ్ జరిగే సమయానికి హైదారాబాద్ లో ఉన్నాడు. అంత మంచి మ్యాచ్ ని మిస్సవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు." సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుండడంతో వచ్చేసాడని ఫిల్మ్ నగర్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: