సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అశ్వని దత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.


ఇక ఈ సినిమాలో విజాశాంతి రోల్ పై ఇప్పటికే అంచనాలు పెంచేశారు. రాయలసీమ లో పవర్ ఫుల్ లేడీగా విజయశాంతి రోల్ ఉంటుందట. సినిమాలో ఆమె పాత్ర సంచలనంగా మారుతుందని అంటున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ ఫుల్ రోల్ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.


లేడీ సూపర్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయశాంతి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే సరైన పాత్రలు రాక ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి ఇన్నాళ్లకు ముఖానికి రంగేసుకున్నారు. ఈ సినిమా కోసం ఆమెకు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు టైటిల్ పోస్టర్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన అనీల్ తప్పకుండా మహేష్ కు ఓ సెన్సేషనల్ హిట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.


మహర్షి సక్సెస్ తో మహేష్, ఎఫ్-2 సక్సెస్ తో అనీల్ రవిపుడి ఇద్దరు సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తోడయ్యాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు బాగున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో విజయశాంతితో పాటుగా రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: