బాలకృష్ణ రోజాలు ఒక్కప్పటి హిట్ పెయిర్. వారిద్దరి కాంబినేషన్ లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఆ తరువాత మారిన పరిస్థితులలో వీరిద్దరూ    రాజకీయ విరోధులుగా మారిపోయారు. రోజాను బాలయ్య పెద్దగా టార్గెట్ చెయ్యనప్పటికీ ఆమె మాత్రం ప్రతిపక్షంలో ఉండగా బాలయ్య మీద తీవ్ర విమర్శలే చేసింది. 

అయితే ఈ రోజు ఆ విషయాలు ఏమి పట్టిచుకోకుండా రోజాను స్వయంగా బాలయ్య   ఈరోజు అసెంబ్లీ లాబీలో పలకరించడం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా మీడియా కెమెరాల దృష్టిని కూడ ఆకర్షించింది. ‘బాగున్నారా’ అంటూ బాలకృష్ణ రోజాను పలకరించడం చూసిన వారు బాలయ్య సంస్కారానికి ఫిదా అయిపోయారు. 

ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన రోజాను సెల్ఫీల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టడం ఆమె క్రేజ్ ను సూచిస్తోంది. ఆతరువాత చాలామంది పార్టీలకు అతీతంగా బాలకృష్ణను పలకరించడం బాలయ్య రాజకీయాలలో అందరివాడు అన్న సంకేతాలను ఇస్తోంది. బాలయ్యకు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా శుభాకాంక్షలు తెలపడానికి ఎగబడటం ఈరోజు అసెంబ్లీ సమావేసాలలోని విశేషం. 

మరొక వైపు ఈ దృశ్యాలను చూసిన వారు బాలకృష్ణ చొరవ చూపించి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తీసుకుంటే రానున్న రోజులలో అతడికి జూనియర్ సపోర్ట్ కూడ లభించి స్తబ్దంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్య కర్తలకు ఉత్సాహం లభించే ఆస్కారం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా తెలుగుదేశం మార్క్ పసుపు చొక్కా వేసుకుని తలకు విగ్ పెట్టుకుని ఎక్కడా ఒక్క తెల్ల వెంట్రుక కనిపించకుండా బాలయ్య మేకప్ వేసుకుని చేస్తున్న హడావిడి మీడియాకు హాట్ న్యూస్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: