కైరా తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె షాహిద్ కపూర్కు జంటగా నటించిన ‘కబీర్ సింగ్’ జూన్ 21న విడుదల కాబోతోంది. తెలుగు హిట్ ‘అర్జున్రెడ్డి’కి హిందీ రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. మాతృకను తీసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. మరోపక్క కియారా ‘గుడ్ న్యూస్’, ‘లక్ష్మీ బాంబ్’, ‘షేర్షా’ సినిమాల్లో నటించనున్నారు.
నా తొలి సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది. కాబట్టి ప్రజలు నాతో కలిసి పనిచేయాలంటే ఆలోచించేవారు. ఆ సమయంలో అవకాశం ఇవ్వమని నేనే దర్శకుల్ని కలిసేదాన్ని. అయినా తమ ప్రాజెక్టులోకి తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ దర్శకులే నాతో పనిచేస్తున్నారు. పరిస్థితులు అలా మారాయి. ‘ఎమ్.ఎస్ ధోని’ సినిమా వల్ల నా కెరీర్లో చాలా మార్పు వచ్చింది. ప్రజలు నన్ను గుర్తించారు.
‘మెషిన్’ బాక్సాఫీసు వద్ద హిట్ కాలేకపోయింది. కానీ ఈ సినిమాలోని ‘చీజ్ బడీ..’ పాట అందరి దృష్టిలో పండింది. నిజానికి నా దక్షిణాది సినిమాల వల్ల కెరీర్లో పుంజుకోగలిగా. బాలీవుడ్లో ‘లస్ట్ స్టోరీస్’లోని పాత్ర వల్ల నాకు బాగా నటించే అవకాశం దక్కింది’ అని అన్నారు. తొలి సినిమా ఫ్లాప్ కావడంతో తనతో కలిసి పనిచేసేందుకు దర్శకులు ఆలోచించేవారని కథానాయిక కియారా అడ్వాణీ అన్నారు.
ఆమె 2014లో ‘ఫుగ్లీ’ సినిమాతో బాలీవుడ్కు పరిచయం అయ్యారు. అక్షయ్ కుమార్, మోహిత్ మార్వా, విజేందర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. కబీర్ సదానంద్ దర్శకుడు. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీని తర్వాత తనకు ఆఫర్లు రాలేదని కియారా తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ కెరీర్లో విరామం రావడం వల్ల తనకు మంచే జరిగిందని వెల్లడించారు.