టాలీవుడ్ లో ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా వంటి క్లాస్ ఎంటెర్టైనెర్స్ ని తీసి, ప్రేక్షకుల్లో తనకంటూ కొంత వైవిధ్యమైన పేరు సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే అయన ఆఖరి చిత్రం ఫిదా విడుదలై దాదాపుగా రెండేళ్లు కావస్తున్నప్పటికీ అయన కొత్త సినిమా ఏది ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక అంతా కొత్త వారితో కలిసి అయన ఒక సినిమాని తీస్తున్నారు,
 
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అయన తరువాతి సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఒక కొత్త సినిమా అతిత్వరలో పట్టాలెక్కనుందని సమాచారం. ఇక ఈ సినిమా ఫిదా తరహాలో సాగే హృదయానికి హత్తుకునే మరొక లవ్ స్టోరీ అని అంటున్నారు. అయితే మొదట చైతన్య సరసన మరొక హీరోయిన్ ని తీసుకుందాం అనుకున్నప్పటికీ, చివరికి సాయి పల్లవికి ఓటేయడం జరిగిందట. 

ఒక టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు త్వరలో అధికారిక ప్రకటన రూపంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది మజిలీతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య, ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక శేఖర్ కమ్ముల తో చేయబోయే సినిమాతో మంచి హిట్ కొడితే కనుక, చైతన్యకు మరొక సక్సెస్ తన ఖాతాలో చేరినట్లే. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: