పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘లోఫర్‌’తో వెండితెరపై అడుగుపెట్టిన దిశా పటానీ ఆ తర్వాత హిందీ చిత్ర సీమపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. ‘ఎమ్‌ఎస్‌ ధోనీ..’, ‘బాఘీ 2’ ‘భారత్‌’ తదితర చిత్రాలతో బాలీవుడ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది దిశ. వెండితెరపై తన అందచందాలతో ఎంత పాపులర్‌ అయిందో బాయ్‌ ఫ్రెండ్స్‌ విషయంలోనూ అంతకంటే ఎక్కువగానే సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యింది.

 

కొన్ని రోజులు ఆదిత్య ఠాక్రేతో, తర్వాత టైగర్‌ ష్రాఫ్‌లతో చెట్టాపట్టాలేసుకొని రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతుందంటూ వాళ్లతో కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. ఓ ఇంటర్వ్యూలో బాయ్‌ ఫ్రెండ్స్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్న విషయాలపై ఆమె మాట్లాడింది. ‘‘ప్రతి ఒక్కరూ స్నేహితులతో కలిసి లంచ్‌, డిన్నర్‌లకు వెళ్తుంటారు.

 

అందులో తప్పేముంది? స్నేహితుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉంటారు. జెండర్‌ ఆధారంగా స్నేహితుల్ని ఎంచుకొనే అలవాటు నాకు లేదు. కేవలం అమ్మాయిలతోనే స్నేహం చేయాలని అనుకోవడం లేదు’’ అని చెప్పింది. చిత్రసీమ అంటేనే నిరంతరం అందరి దృష్టీ ఉండే రంగమని తెలిసే ఇక్కడికి వచ్చానంటోంది దిశ. ‘‘సినిమా అనేది గ్లామర్‌ ప్రపంచం.

 

ఇందులో నాయికలపై అందరి దృష్టి ఉంటుందని నాకు తెలుసు. కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నేను పట్టించుకోను. కేవలం నా పని మీదే దృష్టిపెడతాను’’ అని చెప్పింది దిశ. ఆమె ప్రస్తుతం థ్రిల్లర్‌ చిత్రాల దర్శకుడు మోహిత్‌ సూరి తెరకెక్కిస్తోన్న  ‘మలంగ్‌’లో నటిస్తోంది. ఐరన్ లెగ్ అనిపించుకున్న అమ్మడు గోల్డెన్ లెగ్ అని అనిపించుకుంటుందా.. చూడాలి మరి!


మరింత సమాచారం తెలుసుకోండి: