ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో వుంది. తన మేనమామ వెంకటేష్ తో కలిసి వెంకీమామ చేస్తున్నాడు. ఆ సినిమా దాదాపు ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. ఈ సినిమా తరువాత బంగార్రాజు సినిమా ను నాగ్ తో కలిసి జులై ఎండ్ లో స్టార్ట్ చేయబోతున్నాడు. ఇది కాకా యువి బ్యానర్ లో మేర్లపాక గాంధీ సినిమా లైన్‌లో వుంది. దిల్ రాజు నిర్మాణంలోను ఓ సినిమా ప్లానింగ్ లో వుంది. 


ఇలాంటి టైమ్ లో మరో మాంచి కాఫీ లాంటి సినిమా ఒకటి ఫిక్స్ అయింది. ఫీల్ గుడ్ మూవీ మేకర్ శేఖర్ కమ్ముల డైరక్షన్ లో చైతన్య ఓ సినిమా చేయడానికి అంతా రెడీ అయిందని లేటెస్ట్ న్యూస్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో కాదు, శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో నటించి, ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి. చైతన్య-శేఖర్ కమ్ముల-సాయిపల్లవి కాంబినేషన్ అంటే అంచనాలు ఓ రేంజ్ లో వుంటాయి. 


ప్రస్తుతం శేఖర్ కమ్ముల చేస్తున్న కొత్త  ప్రాజెక్టుకు కాస్త గ్యాప్ వచ్చింది. అంతా కొత్త వాళ్ళతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని హీరో, హీరోయిన్లు డ్యాన్స్ ట్రయినింగ్ కు వెళ్తున్నారు. అందుకనే ఈ సినిమాకు మూడునెలల పాటు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో చైతన్య-శేఖర్ కమ్ముల-సాయిపల్లవి కాంబినేషన్‌లో ఈ సినిమా చేసే ప్లానింగ్ ఏదో జరుగుతోందని ఫ్లాష్ న్యూస్. అయితే మరీ మూడు నెలల టైమ్ శేఖర్ కి సరిపోతుందా అని కొంతమంది అనుకుంటున్నారట. ఫిదా తర్వాత సాయి పల్లవి కూడా చెప్పుకోదగ్గ హిట్ ఇటు తెలుగులోగాని అటు తమిళంలో గాని పడలేదు. మరి శేఖర్ మళ్ళీ సాయి పల్లవికి మరో హిట్టిస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: