మాధవన్ సెలెక్టెడ్‌గా మంచి పాత్రలను ఎంచుకున్నాడు. సుధ కొంగర దర్శకత్వంలో సాలా ఖదూస్, అదే సినిమా తమిళ రీమేక్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. రీసెంట్‌గా టాలీవుడ్‌లోను ఒక సినిమాలో నటించాడు. ఇప్పుడు మాధవన్ మరో సినిమాతో రాబోతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో 17 ఏళ్ల క్రితం వచ్చిన 'అమృత' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులో కూడా డబ్ అయిన సినిమా కమర్షియల్ గా సక్సస్ కాపోయినా కూడా ఆ సినిమా కథ, అమృత పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో బలంగా నిలిచింది. ఆ సినిమాలో ఒక పాపకు  తల్లిదండ్రులుగా మాధవన్, సిమ్రాన్ లు నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.  


పరవశం, అమృత సినిమాలో కలిసి నటించిన మాధవన్, సిమ్రాన్ మళ్లీ కలిసి 17 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నంబి నారాయణన్ బయోపిక్ గా రూపొందుతున్న 'రాకేట్రీ : ది నంబి ఎఫెక్ట్' లో మాధవన్ టైటిల్ రోల్ ను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా మాధవన్ చేయడం విశేషం. యంగ్ నంబి నారాయణన్ కు జోడీగా సిమ్రాన్ కనిపించబోతుంది. 


ప్రస్తుతం వీరిద్దరి కాంబో సీన్స్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. అతి త్వరలోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. మాధవన్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఒక గెటప్ లో శాస్త్రవేత్తగా కనిపించబోతున్నాడు.. ఇక రెండవ గెటప్ లో గడ్డం మీసాలు లేకుండా క్లీన్ షేవ్ తో కనిపించబోతున్నాడు. సిమ్రాన్ కనిపించేది కొద్ది సమయమే అయినా మాధవన్ తో ఈమె కాంబో సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని లేటెస్ట్ న్యూస్. ఇక సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా బాగానే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: