క్యాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి
తెలిసిందే. శ్రీరెడ్డి ఇలా బహిరంగంగా విమర్శలు చేసిన తరువాతే.. అన్ని
విషయాలు బయటకు వచ్చాయి. అనేక మంది క్యాస్టింగ్ కౌచ్ విషయంపై విమర్శలు
చేయడం మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్
లాంటి వ్యక్తిని సైతం ఆమె వదలలేదు. రానా ఫ్యామిలీపై అయితే ఒంటికాలిపై
లేస్తుంది. ఇలాంటి శ్రీ రెడ్డి ఇప్పుడు మహానటి సినిమాలో టైటిల్ రోల్ ప్లే
చేసిన కీర్తి సురేష్ పై హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ సోషల్
మీడియాలో వైరల్ అయ్యాయి.
కీర్తి సురేష్
ప్రయాణిస్తున్న ఫ్లైట్ లోనే శ్రీరెడ్డి కూడా ప్రయాణిస్తున్న సమయంలో ఓ సంఘటన
జరిగింది. మహానటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ను ఎవరు
గుర్తుపట్టలేదట. ఎందుకంటే ఆమె జిమ్ కు వెళ్లి తన షేప్ ను మార్చుకుంది.
సన్నగా పేషెంట్ గా మారిపోయింది.
దీంతో ఆమెను
ఎవరు గుర్తుపట్టలేదని, సెల్ఫీ కోసం ఫ్లైట్ లోని ప్రయాణికులంతా తనదగ్గరకు
వచ్చారని అంటోంది శ్రీ రెడ్డి. మహానటి సినిమాలోని కీర్తికి, ప్రస్తుతం
ఉన్న కీర్తికి చాలా డిఫరెంట్ ఉన్నది. నాగార్జున మన్మధుడు 2 లో మామూలుగానే
ఉన్నది. బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చింది కాబట్టి ఆ పాత్రకోసం అలా
మారిపోవలసి వచ్చిందేమో.