బాహుబలి వంటి భారీ  విజయం సాధించిన చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘సాహో’. యంగ్ డైరకర్టర్ సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల కంటే ఎక్కువ నిర్మాణం తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఒక టీజర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్ రిలీజ్ చేసి మా సినిమా హాలీవుడ్ స్దాయిలో ఉంటుందని చెప్పకనే చెప్పారు.

 

ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో పాత్రల గురించి డిస్కషన్ మొదలైంది. గన్ను చేతిలో పట్టుకుని నిలబడ్డ శ్రద్దాకపూర్ ఏ పాత్ర చేస్తోంది అని బాలీవుడ్ లోనూ చర్చ మొదలైంది. టీజర్ ని బట్టి ఆమె పోలీస్ పాత్రలో కనిపిస్తోందని అర్దమైంది. అది నిజమేనని శ్రద్ధ కూడా ఓ ఆంగ్ల పత్రిక  ద్వారా తెలియచేసారు. శ్రద్ద కపూర్ ప్రస్తావించిన విషయాలివి!

 

తొలిసారి నేను పోలీసు పాత్రలో నటిస్తున్నందుకు చాలా కొత్తగా ఉంది. దేశం కోసం భద్రతా బలగాలు ఎన్నో త్యాగాలు చేస్తాయి. అలాంటిది నేను వారి పాత్రలో నటిస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకు డాక్టర్ గా, పోలీసుగా విభిన్న పాత్రల్లో నటించాలనేది కోరిక, ఇంట్రస్ట్. కానీ ఎన్ని క్యారక్టర్స్ చేసినా   పోలీసు పాత్ర చాలా స్పెషల్‌. షూటింగ్‌ చేస్తున్నంతసేపు నేను గన్ను పట్టుకునే ఉన్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే గన్ను నా బాడీలో ఓ పార్ట్ లా మారిపోయింది.

 

సెట్‌లో ఉన్నప్పుడు నా చేతిలో గన్ను లేకపోతే దాని కోసం ఎంక్వైరీ తీసేదాన్ని. ఎప్పుడు, ఎలాంటి సిట్యువేషన్ లో గన్ను వాడాలన్న విషయంలో ఓ పోలీసు మైండ్‌ చాలా షార్ప్‌గా ఉంటుంది. ఆ విషయాలు కూడా నేను తెలుసుకోవాలి’ అని చెప్పుకొచ్చింది శ్రద్ధ. ప్రభాస్  హీరోగా నటిస్త్తున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: