భార్య భర్తల్ పట్ల మధ్య వచ్చే అలకలు, కోపాలు చాలా అందంగా ఉంటాయి. సెలెబ్రిటీల జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుందా అని చాలా మంది అనుకుంటారు. వాళ్ళ పర్సన ల్ లైఫ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది.  ఈ మధ్య కొన్ని షోస్ వాళ్ల పర్సనల్ జీవితాల మీద క్వశ్చన్స్ అడుగుతున్నాయి. అలా ఒకానొక షోలో షాహిద్ కపూర్ తన ఫ్యామిలీ లైఫ్ గురించి బయటపెట్టాడు.

 

షాహిద్ కపూర్ నటించిన " కబీర్ సింగ్" ప్రమోషన్ లో భాగంగా "నేహా ధుపియ" షో కి వచ్చాడు. దాన్లో మీ వైఫ్ తో మీరెప్పుడైనా గొడవ పడతారా అని అడగ్గా ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. " నాకెప్పుడు నా భార్యతో గొడవ జరిగిన ఆందోళనగా ఉంటుంది. ఈ విధంగా చాలా రోజులు ఉంటుంది."  అని చెప్పుకొచ్చాడు. గొడవ పడ్డ తర్వాత ఆ ఫీలింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు. ఆ ఫీలింగ్ తొందరగా పోదని తనని వెంటాడుతూ ఉంటుందని చెప్పాడు.

 

వాళ్ళు సాధారణంగా ఎక్కువ గొడవ పెట్టుకోరట. కొన్ని నెలలకొకసారి వారిద్దరి మధ్య గొడవ జరుగుతుందని, ఆ గొడవ నుండి బయటకు రావడానికి తనకి చాలా టైం పడుతుందని, ఒక్కోసారి 15 రోజులు అవుతుందని చెప్పాడు. భార్యా భర్తలు గొడవ పడటం మంచిదని, ఎవరి అభిప్రాయలు వారికి ఉండాలని అన్నాడు.

 

నా అభిప్ర్రాయంతో ఆమె ఏకీభవించాల్సిన అవసరం లేదని, ఎవరి పర్సనల్ స్పేస్ వారికుంటే బాగుంటుందని, తనకు అలాగే ఇష్టమని చెప్పాడు. షాహిద్ కపూర్ ,మిరా రాజ్ పుత్ జంటకి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. షాహిద్ కపూర్ తన " కబీర్ సింగ్ " సినిమా జూన్ 21 న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమా తెలుగు సినిమా అయిన "అర్జున్ రెడ్డి" కి రీమేక్. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ షాహిద్ కపూర్ కి జోడీగా నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: