కమెడియన్ పృధ్వి పై మెగా ఫ్యామిలీ పరోక్షంగా బ్యాన్ పెట్టినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పృధ్వి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా ప్రచారం చేయడమే కాక పవన్ కళ్యాణ్ ను, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు.


ప్రచారంలో ఇవి కామన్ అయినప్పటికీ ఈ విషయాలను అల్లు అర్జున్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా నుంచి పృద్వి పాత్రను తొలగించినట్లు టాక్.


వాస్తవానికి ఈ పాత్ర గురించి ఇప్పటికే త్రివిక్రమ్ పృధ్వికి చెప్పడం, పృధ్వి ఓకే చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో వచ్చిన మార్పుల వలన పృధ్వి పాత్రను తీసివేశామని త్రివిక్రమ్ సున్నితంగా పృధ్వికి చెప్పినట్లు టాక్.


అయితే ఇది అంతా స్క్రిప్ట్ లో వచ్చిన మార్పులుకావనీ బన్నీ సూచనతో జరిగిన మార్పులు అని అంటున్నారు. దీనితో మెగా హీరోల సినిమాలు అన్నింటిలోను ఇదే పద్ధతి అనుసరిస్తే బహుశా ఇక పృథ్వీ మెగా హీరోల సినిమాలలో కనిపించే ఆస్కారం ఉండకపోవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: