న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’. స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహించారు. స్వధర్మ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. అయితే, చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు (జూన్ 18న) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. 


ఫిల్మ్ నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవుతుంది. కాగా, ఈ చిత్రంలో న‌వీన్ డిటెక్టివ్ పాత్రలో న‌టించారు. సినిమా ఆసాంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుందని దర్శకుడు స్వరూప్ చెబుతున్నారు. డిటెక్టివ్‌ జానర్‌లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని.. తెలుగులో ఈ మధ్య కాలంలో ఇలాటి సినిమాలు రాకపోవడంతో డిటెక్టివ్‌ థ్రిల్లర్‌ చేశానని చెప్పారు. 


ఈ కథ రాస్తున్నప్పుడే కొత్త హీరో అయితే బావుంటుందని అనుకున్నానని.. ఆ సమయంలో నవీన్‌ యూట్యూబ్‌ వీడియోస్‌ కొన్ని చూసి, తన టైమింగ్‌ బాగా నచ్చి ఆయన్ని హీరోగా ఎంపిక చేసుకున్నానని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: