పాకిస్థాన్ ఓటమి ..  సానియా మీర్జా మెడకు తగులుకుంది. సానియా మీర్జా మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేయకుండా షోయబ్ మాలిక్ ను రెస్టారెంట్ కు తీసుకు వెళ్లిందంటూ ఒక పాకిస్తానీ మీడియాలో కథనం ప్రసారం అయ్యింది. ఆ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సానియా మీర్జా సీరియస్ కౌంటర్ ఇచ్చింది. పాక్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హాట్ బ్యూటీ వీణామాలిక్ సైతం షోయబ్ మాలిక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్టీస్ మానేసి బయటకు వెళ్లాడంటూ కామెంట్ చేసింది.


ఒక అథ్లెట్ అయ్యి ఉండి తర్వాత రోజు మ్యాచ్ పెట్టుకుని భర్తతో ఎలా జంక్ ఫుడ్ తినిపిస్తుందని.. అలాగే అక్కడ మందు కూడా ఉంటుందని అలాంటి ప్లేస్ కు తమ కొడుకును ఎలా తీసుకు వెళ్లారంటూ వీణా మాలిక్ సానియా తీరును తప్పుబట్టింది.వీణా మాలిక్ వ్యాఖ్యలకు సానియా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. తల్లి అయ్యాక పిల్లల గురించి ఆలోచించకుండా మ్యాగజైన్ ల కోసం హాట్ ఫొటో పోజులు ఇచ్చే వీణా నాకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది.


నా బిడ్డ గురించి నువ్వు అంతగా ఫీల్ అవుతున్నందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసింది. అయితే సానియా ఆ ట్వీట్ ను కొన్ని నిమిషాలకే తొలగించడం జరిగింది. సానియా మీర్జా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఈమె ఇండియా గెలుపు కోసమే అక్కడకు వెళ్లిందని.. పాక్ ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బ తీసేలా ఈమె ప్రవర్తించిందంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: