యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో. సుజిత్ డైరెక్షన్లో భారీ యాక్షన్ మూవీ గా తెరకెక్కిన సాహో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను రూ.250 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుండడంతో సౌత్ టు నార్త్ అన్ని భాషల ప్రేక్షకులు సాహోపై అంచనాలతో ఉన్నారు.
ఇదిలా ఉంటే రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ సాహెపై అంచనాలు మరింతగా పెంచేసింది. ఇప్పుడు సాహోతో ఇద్దరు స్టార్ హీరోలు బాగా టెన్షన్లో పడిపోయినట్టు తెలుస్తోంది. సాహో కేవలం తెలుగులోనే కాకుండా హిందీ , తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ కావడంతో ఇప్పుడు సాహోపై ప్రతి ఒక్కరు ఆసక్తితో వెయిటింగ్లో ఉన్నారు.
ఇక బాలీవుడ్ లో సూపర్ హిట్ పింక్ చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 10 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ..సాహో కు దీనికి కేవలం ఐదు రోజులు మాత్రమే గ్యాప్ ఉండడం వల్ల థియేటర్స్ సమస్య తో పాటు కలెక్షన్లకు ఇబ్బంది అవుతుందని... ఏం చేయాలా ? అని టెన్షన్తో ఉన్నారు.
ఇక మరో కోలీవుడ్ హీరో సూర్య నటించిన సినిమాను సైతం ఆగస్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అసలే సూర్య వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఇప్పటికే మూడు ప్లాపులతో ప్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాడు. ఈ టైంలో వచ్చే సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు సాహో లాంటి ప్రెస్టేజియస్ మూవీకి ఎదురు వెళ్లి సాహసం చేస్తే... రిజల్ట్ తేడా వస్తే సూర్య సినిమా అడ్రస్ గల్లంతే అవుతుంది. అందుకే సూర్య కూడా తన సినిమాను వాయిదా వేసుకోవాలని చూస్తున్నాడట. ఏదేమైనా సాహో దెబ్బతో స్టార్ హీరోల సినిమాలు సైతం వాయిదా పడక తప్పడం లేదు.