అక్కినేని అఖిల్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చాక బాక్సాఫీస్ దగ్గర తనకంటూ ఒక హిట్టు ఇప్పటిదాకా కొట్టలేదు. అఖిల్ కి ఎలాగైనా హిట్ ఇవ్వాలని మరోపక్క తండ్రి నాగార్జున అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాలు తీసినా కానీ అఖిల్ కి సరైన బాక్సాఫీస్ దగ్గర పడలేదు. ఇటువంటి క్రమంలో అక్కినేని అఖిల్ ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతిలో పెట్టారు.


ఈ సందర్భంగా అల్లు అరవింద్ అక్కినేని అఖిల్ ని హీరోగా పెట్టి తనకు తగ్గ కథను బొమ్మరిల్లు భాస్కర్ చేత రాయించి ఆ సినిమాని తన బ్యానర్ లో గీతా ఆర్ట్స్లో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే కూడా జరిగాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ నెల 26 వ తారీఖున రెగ్యులర్ గా ప్రారంభించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్టు సమాచారం.


స్టోరీ పరంగా సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు హైదరాబాదులోనే ఉంటున్నట్లు కొద్ది భాగం మాత్రం విదేశాల్లో తెరకెక్కించినట్లు ఫిలింనగర్ టాక్. కాగా… ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్‌కు త‌ల్లిగా నిన్న‌టి త‌రం న‌టీమ‌ణి ఆమ‌ని న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్-2 పతాకంపై ‘బన్నీ’ వాస్‌, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి మెలోడీ స్పెషలిస్ట్ గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: