రిషి కపూర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఆయన అమెరికా వెళ్ళకుముందు జూహి చావ్లాతో ఒక సినిమా కి రెడీ అయ్యాడు. కానీ సినిమా స్టార్ట్ అవకముందే తనకి క్యాన్సర్ అని తేలడంతో,ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్ళాడు.  అంతటితో ఆ సినిమా అక్కడే ఆగిపోయింది. చివరిసారిగా వీరిద్దరు 2009 లో వచ్చిన  "లక్కీ బై ఛాన్స్" అనే సినిమాలో కనిపించారు.

 

2018 సెప్టెంబరు లో రిషికపూ క్యాన్సర్ బారిన పడ్డాడు.   న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ చేయించుకున్నాడు. ప్రస్తుతం రిషికపూర్ క్యాన్సర్ బారి నుండి బయటపడ్డాడు. త్వరలోనే ఇండియాకి రాబోతున్నాడు. రిపోర్ట్స్ ప్రక్రారం వీరిద్దరు మళ్ళీ  సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఆ సినిమా కి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఇప్పటికే కథ పూర్తయింది. ఒక కామెడీ ఫ్యామిలీ డ్రామా అయి ఉంటుందని సమాచారం.

 

ఈ సినిమాని కొత్త దర్శకుడైనటువంటి  "హితేష్ భాటియా " దర్శకత్వం వహిస్తున్నాడని టాక్. ఈ సినిమాకి కథ "భాటియా" ,స్పురతిక్ సేన్ లు అందించారు. వీరిద్దరు గతంలో " కమీనే, "కై పొ చె" లాంటి సినిమాలకు పని చేసారు. రిషి కపూర్ ఆగస్టు లో ఇండియా వస్తున్నారట. అప్పటిలోగా ప్రీ ప్రొడక్షన్ పనులన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారట.

 

జూహి చావ్లా, రిషి కపూర్ కలిసి 1990 లో చాలా సినిమాల్లో తెరను పంచుకున్నారు. అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వాటిల్లో కొన్ని "బోల్ రాధా బోల్ (1992)" , ’రిస్తా తో హైసా’(1992),  ఘర్ కి ఇజ్జత్(1994), సాజన్ క ఘర్(1994), ఈనా మీనా దీగా(1994), దరార్, చివరిసారిగా వీరు 2009 లో ఇద్దరు కలిసి నటించిన చిత్రం "లక్కీ బై ఛాన్స్" ఈ సినిమాలో వీరు భార్యా భర్తలుగా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: