ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అనుకుంటూ కలలు కన్న బాలకృష్ణ ఎన్నికల ఫలితాలు రాకుండానే కెఎస్. రవికుమార్ మూవీకి ఓకె చెప్పిన విషయం తెలిసిందే. ఈమూవీలో మెయిన్ విలన్ పాత్ర చేస్తున్న జగపతిబాబు పాత్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ఛాయలతో స్క్రిప్ట్ రెడీ కావడంతో అనవసరపు సమస్యలు ఎందుకు అని భావించి బాలకృష్ణ సూచనతో ఈమూవీ కథలో పూర్తి మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. 

వాస్తవానికి బాలకృష్ణ కెఎస్. రవికుమార్ మూవీని దృష్టిలో పెట్టుకుని బాలయ్య గుబురు గడ్డం పెంచాడు అని కామెంట్స్ కూడ వచ్చాయి. దీనితో ఎన్నికల ఫలితాలు తరువాత పరిస్థుతులలో మార్పులు రావడంతో ఈమూవీ కథ కూడ మారడంతో బాలయ్య తన గెడ్డంను ఏమి చేయాలి అన్న ఆలోచనలలో పడిపోయినట్లు టాక్. 

దీనితో దర్శకుడు కెఎస్. రవి కుమార్ సూచనలతో బాలయ్య గెడ్డంను దృష్టిలో పెట్టుకుని అతడి గెటప్ కు భంగ పడకుండా కెఎస్. రవికుమార్ సూచనలతో బాలయ్య సినిమా కథలో మార్పులు జరిగినట్లు సమాచారం. మొదట్లో అనుకున్న కథను మార్చి పరుచూరి మురళీ చెప్పిన కథ ఇప్పుడు బాలయ్య కొత్త సినిమాకు కథగా మారింది అని అంటున్నారు. 

ఈ కన్ఫ్యూజన్ లో జరిగిన ఆలస్యం వల్ల ఈమూవీ మెయిన్ హీరోయిన్ గా అనుకున్న పాయల్ రాజ్ పుట్ డేట్స్ లో తేడా రావడంతో మళ్ళీ ఈసినిమాకు హీరోయిన్ సమస్య ఏర్పడి చివరికి ఎవరు దొరకక శ్రియ వైపు మొగ్గు చూపారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పరిస్థుతులలో ఈమూవీలోని సెకండ్ హీరోయిన్ మెహెరిన్ పాత్ర ఉంటుందా లేదా అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: