కియారా అద్వానీ .. ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. తక్కువ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్  ను హోదా తక్కువ కాలంలో సంపాదించింది. ప్రస్తుతం ఈ భామ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్  పూర్తయిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో మాట్లాడిన కియారా రొమాన్స్ పట్ల ఆసక్తికరంగా స్పందించింది.


కథలో భాగంగా ముద్దు సన్నివేశాలు ఉంటాయి. పైగా ఇది మోడ్రన్‌ లవ్‌స్టోరీ. నేటి ప్రేమల్లో ముద్దులు, కౌగిలింతలు సహజంగా ఉండేవే. కాబట్టి వాటిని అంతే సహజంగా, అందంగా షూట్ చేశాం. నాకైతే ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. కథలో భాగంలో ఎలాంటి సన్నివేశమైనా ఒకటి గానే ట్రీట్ చేస్తా'' అని తెలిపింది కియారా. అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా కావడంతో ఇంటర్వ్యూలో భాగంగా విజయ్‌ దేవరకొండ, షాలిని లను కలిశారా? అనే ప్రశ్న కియారాకు ఎదురైంది.


దీనిపై స్పందించిన ఆమె.. విజయ్‌ దేవర కొండని ఒక అవార్డు వేడుకలో కలిశానని, అర్జున్‌రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. సలహాలు ఇవ్వలేదు కానీ సందీప్‌రెడ్డి ఉన్నాడు కదా! ధైర్యంగా ఉండు అని చెప్పాడంతే.. అని పేర్కొంది కియారా. ఇక తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల తర్వాత తన మూడో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అంటోంది కియారా. మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉన్నానని పేర్కొంది. హైదరాబాద్‌ తన రెండో ఇల్లు లాంటిదని ఆసక్తికరంగా బదులిచ్చింది కియారా.

మరింత సమాచారం తెలుసుకోండి: