అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో పోసాని, పృథ్వి కాంబో కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే కమెడియన్ పృథ్విని ఈ సినిమా నుండి తప్పించారన్న రూమర్ ఇవాళ బలంగా వినిపించింది. ఫిలిం నగర్ లో దీని గురించి ప్రస్తావన కాస్త హాట్ గానే రావడంతో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. వైసిపి తరపున ఎన్నికల ప్రచారంలో పృథ్వి జనసేన మీద సంచలన వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో బన్నీ త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని మీడియాలో కూడా వచ్చింది. 


కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం అసలు వాస్తవం వేరే ఉందని లేటెస్ట్ అప్డేట్. ఇదే సినిమాలో పోసాని కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పోసానికి, పృథ్వి కాంబినేషన్ లో కీలకమైన సీన్లు ఉన్నాయట. కానీ ఇటీవలే పోసాని అస్వస్ధతకు గురి కావడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవలసిందిగా డాక్టర్లు సూచించారు. దీంతో అప్పటికే షూట్ చేసిన కాంబో సీన్లు వేరే ఆర్టిస్టుతో మళ్ళి తీయాలట. పృథ్వి ఇంకోసారి డేట్స్ ఇస్తే తప్ప అది సాధ్యపడదని సమాచారం.


కానీ చేతిలో ఉన్న వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చేసిన కారణంగా ఈ సినిమాకి మళ్ళీ డేట్స్ ఇవ్వలేనని పృథ్వి వ్యక్త పరచడంతో అతన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించి ఆ ఇద్దరి స్థానంలో కొత్త ఆర్టిస్టులతో రీ షూట్ చేయబోతున్నారని తెలిసింది. కానీ ఇంతలోనే జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ వార్త ఇంకో రకంగా ప్రచారంలోకి వచ్చింది. మెగా హీరోస్ ఎప్పుడూ రాజకీయాలకు సినిమాలకు ముడిపెట్టరని అందరికి తెలిసినా ఇలా స్ప్రెడ్ కావడం ఫ్యాన్స్‌ని నిరాశకు గురి చేసింది. మొత్తానికి దీనికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చేసింది గానీ, రీ ప్లేస్ అవ్వబోతున్న ఆర్టిస్టులు గురించి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: